AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌ 5.0పై రాష్ట్రాలదే తుది నిర్ణయం..?

రేపటితో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఈ నేపధ్యంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న 11 నగరాల్లో లాక్ డౌన్ 5.0ను అమలు చేస్తారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మరిన్ని సడలింపులను సైతం ప్రకటిస్తారని అంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరిమిత నిబంధనలు విధించడంతో పాటు ఢిల్లీ మెట్రోతో సహా మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ 5.0లో ఢిల్లీ, […]

లాక్‌డౌన్‌ 5.0పై రాష్ట్రాలదే తుది నిర్ణయం..?
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 8:24 AM

Share

రేపటితో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఈ నేపధ్యంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న 11 నగరాల్లో లాక్ డౌన్ 5.0ను అమలు చేస్తారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మరిన్ని సడలింపులను సైతం ప్రకటిస్తారని అంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరిమిత నిబంధనలు విధించడంతో పాటు ఢిల్లీ మెట్రోతో సహా మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

లాక్ డౌన్ 5.0లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా నగరాలపైనే కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అటు జన సాంద్రత ఎక్కువగా ఉండే థియేటర్లు, ప్రార్ధనా మందిరాలకు లాక్ డౌన్ 5.0లో అనుమతి లభిస్తుందా? లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఇప్పటికే లాక్ డౌన్ 4.0లో సెలూన్లకు అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా జిమ్స్ కూడా తెరుచుకునేందుకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది.

కంటైన్మెంట్ జోన్లు మినహా.. అన్ని ప్రాంతాల్లోనూ కోవిడ్ 19 నిబంధనలతో జిమ్స్‌కు అనుమతించే అవకాశం ఉందని సమాచారం. స్కూల్స్, విద్యాసంస్థలపై యధావిధిగా నిషేధం కొనసాగనుంది. కాగా, లాక్ డౌన్ 5.0లో రాష్ట్ర ప్రభుత్వాలే నిబంధనలు విధించేలా కేంద్రం ప్రతిపాదనలు సిద్దం చేస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా, కేంద్రం విధించే నిబంధనలను నీరుగార్చకుండా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో లాక్ డౌన్ పొడిగింపు అంశంపై హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడిన సంగతి విదితమే.

Also Read: ఏపీలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు.. వాటికి కూడా అనుమతులు..