ఢిల్లీలో కరోనా సామూహిక వ్యాప్తి ఉందా ? తెలుసుకుంటాం.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
ఢిల్లీలో కరోనా సామూహిక వ్యాప్తి ఉందా అన్న విషయాన్ని రేపు తేల్చుకుంటామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ అంశంపై రేపు కీలక సమావేశం జరుగుతుందన్నారు...
ఢిల్లీలో కరోనా సామూహిక వ్యాప్తి ఉందా అన్న విషయాన్ని రేపు తేల్చుకుంటామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ అంశంపై రేపు కీలక సమావేశం జరుగుతుందన్నారు. అస్వస్థతకు గురై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిన నేపథ్యంలో.. సిసోడియా సోమవారం సాయంత్రం వర్చ్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి తాము ఆందోళనతో ఉన్నామని ఆయన చెప్పారు. రేపు స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీకి, నిపుణులకు మధ్య సమావేశం జరుగుతుందని, ఈ మీటింగ్ కి హాజరయ్యే అధికారం తనకు ఉందని ఆయన అన్నారు. కరోనా సామూహిక వ్యాప్తి ఉన్నట్టు తేలితే మొత్తం వ్యూహాన్ని మార్చేస్తామని అయన తెలిపారు. కాగా… స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీకి చైర్మన్గ్ గా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తున్నారు.