AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ప్రభుత్వం బంపర్ ఆఫర్..

మందుబాబులకు మహా సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం మే 5 నుంచి లిక్కర్ షాపులకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మద్యం ప్రియులు పలు చోట్ల భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో.. బీర్, వైన్‌తో సహ అన్ని రకాల స్వదేశీ, విదేశీ బ్రాండ్లులను ఇంటి వద్దకే సరఫరా చేసే వెసులుబాటును కల్పించింది. అయితే ఈ సౌకర్యాన్ని లైసెన్స్ ఉన్న లిక్కర్ షాపులకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం […]

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ప్రభుత్వం బంపర్ ఆఫర్..
Ravi Kiran
|

Updated on: May 13, 2020 | 8:31 AM

Share

మందుబాబులకు మహా సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం మే 5 నుంచి లిక్కర్ షాపులకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మద్యం ప్రియులు పలు చోట్ల భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో.. బీర్, వైన్‌తో సహ అన్ని రకాల స్వదేశీ, విదేశీ బ్రాండ్లులను ఇంటి వద్దకే సరఫరా చేసే వెసులుబాటును కల్పించింది. అయితే ఈ సౌకర్యాన్ని లైసెన్స్ ఉన్న లిక్కర్ షాపులకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

మరోవైపు మద్యం హోం డెలివరీ విషయంలో మహారాష్ట్ర సర్కార్ పలు నిబంధనలను ఖరారు చేసింది. సదరు మద్యం షాపు విస్తరించి ఉన్న నిర్ణీత ప్రాంతం వరకే హోం డెలివరీకి అనుమతి. డెలివరీ చేసే బాయ్స్ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అంతేకాకుండా తరచూ హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాలి. నిర్దేశించిన రోజుల్లో మాత్రమే మద్యం డెలివరీకి అనుమతి ఉంటుంది. కాగా, లాక్ డౌన్ ముగిసేవరకు మాత్రమే ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. అటు మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 23.401 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… వైరస్ కారణంగా 868 మంది మృత్యువాత పడ్డారు. 4786 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Read This: దేశీయ విమానాలకు మళ్లీ రెక్కలు.. ఈ రూల్స్ తప్పనిసరి!