‘కడపలో కఠినమైన లాక్డౌన్’.. ఉదయం 10 గంటలకే అన్నీ బంద్..
కడపలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4361 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసులు పెరుగుతూండటంతో.. వైరస్ను కంట్రోల్ చేసేందుకు కడప అధికారులు కీలక నిర్ణయం..
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్లో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 వేలు దాటేసింది. అందులోనూ ఏపీలోని పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. అందులో భాగంగానే కడపలో కూడా కఠినమైన లాక్డౌన్ అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
కడపలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4361 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసులు పెరుగుతూండటంతో.. వైరస్ను కంట్రోల్ చేసేందుకు కడప అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కడపలో రేపటి నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి అధికారులు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు అధికారులు.
Read More:
ఏపీ, తెలంగాణలో కోవిడ్ టెర్రర్.. రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి..
విద్యార్థులకు శుభవార్త.. పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు..