కరోనా కష్టం.. విపరీతంగా పీఎఫ్ నగదు విత్డ్రా
భారత్లో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. దీంతో ప్రజలు ఆదాయం కోల్పోవడంతో ఈపీఎఫ్ నుంచి కొంత నగదును తీసుకుంటున్నారు. కరోనా కారణంగా సవరించిన నిబంధనల ప్రకారం రూ.2,700 కోట్లను పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ నగదును తీసుకున్నారని ఈపీఎఫ్వో ద్వారా తెలిసింది. అలాగే ఈపీఎఫ్వో నుంచే కాకుండా సంస్థలు నిర్వహిస్తోన్న పీఎఫ్ ట్రస్టుల్లోనూ ఉద్యోగులు అవసరమైన మేరకు డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రోజుకు సగటున 30 నుంచి 35 వేల మంది పీఎఫ్ కోసం క్లెయిమ్ […]
భారత్లో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. దీంతో ప్రజలు ఆదాయం కోల్పోవడంతో ఈపీఎఫ్ నుంచి కొంత నగదును తీసుకుంటున్నారు. కరోనా కారణంగా సవరించిన నిబంధనల ప్రకారం రూ.2,700 కోట్లను పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ నగదును తీసుకున్నారని ఈపీఎఫ్వో ద్వారా తెలిసింది. అలాగే ఈపీఎఫ్వో నుంచే కాకుండా సంస్థలు నిర్వహిస్తోన్న పీఎఫ్ ట్రస్టుల్లోనూ ఉద్యోగులు అవసరమైన మేరకు డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.
రోజుకు సగటున 30 నుంచి 35 వేల మంది పీఎఫ్ కోసం క్లెయిమ్ చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పటివరకూ రూ.2700 కోట్లు పీఎఫ్ కోసం చెల్లించామని తాజాగా కేంద్రం తెలిపింది. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల వారే కాకుండా బ్లూచిప్ కంపెనీల ఉద్యోగులూ క్లెయిమ్ చేస్తున్నారని తెలిపారు. లాక్డౌన్లో ప్రజలు ఆదాయం కోల్పోవడం వల్ల ఇలా పీఎఫ్ డబ్బు డ్రా చేస్తున్నారు. కాగా మళ్లీ లాక్డౌన్ కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ఉపసంహరించుకునే వారి సంఖ్య పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More:
మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!
లైవ్లో ‘ఐలవ్యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ