కేరళలో కొత్తగా మరో 1,298 పాజిటివ్ కేసులు
కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అన్లాక్ ప్ర్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం..
కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అన్లాక్ ప్ర్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 18,337 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,983 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 97 మంది మరణించారు. ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పలు చోట్ల లాక్డౌన్ విధిస్తోంది ప్రభుత్వం.
18,337 #COVID19 infected people have recovered so far in Kerala. 25,205 samples were analyzed during the last 24 hours. A total of 9,08,355 samples have so far been sent for testing & the results of 6,346 samples are yet to come: Kerala Health Minister https://t.co/Fc8Tinj1q2
— ANI (@ANI) August 6, 2020
Read More :