AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్నలిస్టును పొట్టనబెట్టుకున్న మహమ్మారి

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో యాభైవేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వీరిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు రెండు వేలకు చేరువలో ఉంది. సామాన్య ప్రజల నుంచి అందర్నీ ఈ మహమ్మారి కాటేస్తోంది. తాజాగా యూపీలోని ఓ జర్నలిస్టును పొట్టనబెట్టుకుంది. శుక్రవారం నాడు కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్రా నగరంలో చోటుచేసుకుంది. సదరు జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ […]

జర్నలిస్టును పొట్టనబెట్టుకున్న మహమ్మారి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2020 | 12:43 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో యాభైవేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వీరిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు రెండు వేలకు చేరువలో ఉంది. సామాన్య ప్రజల నుంచి అందర్నీ ఈ మహమ్మారి కాటేస్తోంది. తాజాగా యూపీలోని ఓ జర్నలిస్టును పొట్టనబెట్టుకుంది. శుక్రవారం నాడు కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్రా నగరంలో చోటుచేసుకుంది. సదరు జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని టెస్టుల్లో తేలడంతో.. వెంటనే ఆయన్ను స్థానిక ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందిస్తుండగా.. తుదిశ్వాస విడిచాడంటూ ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ప్రభూ ఎన్ సింగ్ చెప్పారు.

కాగా.. యూపీలో తొలుత వెయ్యి లోపు కేసుల ఉండగా.. ఆ తర్వాత.. కేసులు మూడు వేలకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,071కి చేరింది. ఇక వీరిలో కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 62కి చేరుకుంది. ఇక మరో 1250 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.