AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనులు లేక కూలీల అవస్థలు.. 600 కిలో మీటర్లు నడిచి..

ముఖ్యంగా ముంబైలో రోజువారీ కూలీలు స్వస్థలాలకు వలస పోవడం భయోత్పాతాన్ని సృస్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని జబుబా, ధార్, బర్వానీ, ఖఆర్ గోనే జిల్లాలకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా ముంబైలో కూలీలుగా పనిచేస్తూంటారు. వీరందరికీ ప్రస్తుతం పనులు లేకపోవడంతో..

పనులు లేక కూలీల అవస్థలు.. 600 కిలో మీటర్లు నడిచి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2020 | 12:59 PM

Share

దేశ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌.. పేదలకు శాపంగా మారింది. ప్రధాని చేసింది మంచి ఉద్ధేశానికైనా..పేదల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. రోజువారీ కూలీల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పని లేకపోవడంతో కూలీలకు ఆదాయం లేకుండా పోయింది. దాచుకున్న పదో పరకో కూడా పెరిగిన ధరల దెబ్బకు ఆవిరి అయిపోతాయని.. నగరంలో జీవించలేక.. వారి స్వస్థలాకు ప్రయాణమవుతున్నారు. అందులోనూ ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో.. నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.

ముఖ్యంగా ముంబైలో రోజువారీ కూలీలు స్వస్థలాలకు వలస పోవడం భయోత్పాతాన్ని సృస్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని జబుబా, ధార్, బర్వానీ, ఖఆర్ గోనే జిల్లాలకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా ముంబైలో కూలీలుగా పనిచేస్తూంటారు. వీరందరికీ ప్రస్తుతం పనులు లేకపోవడంతో తమ ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే వీరి గ్రామాలు ముంబాయి నుంచి 600 కిలో మీటర్లు దూరంలో ఉన్నాయి. అలానే చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. పనులు లేక నిలువ నీడ లేక వీరంతా గ్రామాలకి వలస పోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది సంఖ్యలో ప్రజలు తమ స్వస్థలాలకు నడుచుకుంటూ పోతున్నారు. హృదయ విదారకంగా మారిన ఈ దృశ్యాలు జాతీయ ఛానెళ్లలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: 

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

రైతులకు ఊరట.. లాక్‌డౌన్ వర్తించదు..

తిండి లేక గడ్డి తింటోన్న చిన్నారులు..

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

Follow Us