కరోనా విరుగుడుకు గంగాజలం..ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే..?
భారత్లోని పవిత్ర గంగానది జలంతో వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీ ప్రతిపాదన తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే.

కోవిడ్-19 భూతం… దేశాలపై పడి ప్రతాపం చూపెడుతోంది. బిమారిలా వచ్చి మహమ్మారిలా మారిన ఈ వైరస్కి నేటికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావకపోవటం దురదృష్టకరం. అయితే, దీనిని అంతమొందించేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే ఇటీవల భారత్లోని పవిత్ర గంగానది జలంతో వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొనవచ్చనే ప్రతిపాదన తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. గంగాజలంతో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టవచ్చేమో పరీక్షించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ )కు ప్రతిపాదన చేసింది. కాగా, ఆ ప్రతిపాదనను ఐసీఎంఆర్ తిరస్కరించినట్లు సమాచారం.
