AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి బాలకృష్ణ హీరోయిన్

తనకు వస్తున్న ఆలోచనలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. గత ఎనిమిదేళ్లు విరామం అనేది లేకుండా పనిచేస్తున్న తనకు.. లాక్‌డౌన్ కారణంగా దొరికిన విరామసమయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు....

రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి బాలకృష్ణ హీరోయిన్
Sanjay Kasula
|

Updated on: Jun 08, 2020 | 1:09 PM

Share

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే లాక్‌డౌన్ కాలాన్ని తెగ ఏంజాయ్ చేస్తున్నారట. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆమెకు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయట. తనకు వస్తున్న ఆలోచనలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. గత ఎనిమిదేళ్లు విరామం అనేది లేకుండా పనిచేస్తున్న తనకు.. లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామసమయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. స్వయంగా కథలు రాసుకుంటున్నాట్లుగా వెల్లడించారు. అంతేకాదు భ‌విష్య‌త్ గురించి ఎక్కువ‌గా ఆలోచిస్తూ.. ప్ర‌స్తుత ఈ స‌మ‌యంలో అసంతృప్తిగా గ‌డ‌ప‌వ‌ద్ద‌ని ఆమె సూచించారు. అసంతృప్తి ఎక్కువైతే జీవితంలో సంతోషం దూరమవుతుందన్నారు. సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి ఓ రెస్టారెంట్‌ ఆరంభిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా వచ్చిందంటూ స‌ర‌దాగా రాధికా ఆప్టే అన్నారు.

నందమూరి బాలకృష్ణకి జోడీగా లెజెండ్, లయిన్ సినిమాలలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఈ అమ్మడు బాలీవుడ్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.  ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రాధిక డైరెక్ట్‌ చేశారు.