లాక్డౌన్ ఎఫెక్ట్ః అక్కడి పేదలకు 2 శాతం వడ్డీకే రుణాలు
రుణం ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టడం మొదలు పెట్టాలి. పైగా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి గ్యారెంటీ అవసరం ఉండదని సీఎం..

కరోనా, లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి లేక చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద రూ.20లక్షల కోట్లతో ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలు కూడా పేదలకు లబ్ధిచేకూరేలా పలు పథకాలను ప్రవేశపెడ్డుతున్నాయి.
కరోనా కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు గుజరాత్ సీఎం విజయ్ రుపానీ కొత్త స్కీం ప్రకటించారు. ఆత్మనిర్భర్ గుజరాత్ సహాయ్ యోజన్ పథకం ద్వారా పేదలను ఆదుకోనున్నారు. ఆత్మ నిర్భర్ గుజరాత్ సహాయ్ యోజన పథకం ద్వారా చిరు వ్యాపారులు, స్కిల్డ్ లేబర్, ఆటో వాలాలకు, ఎలక్ట్రీషియన్లకు, బార్బర్లు, మొదలగు 10లక్షల మందికి లాభం జరుగుతుందని చెప్పారు. ఆత్మ నిర్భర్ గుజరాత్ సహాయ్ యోజన పథకం కింద అతి తక్కువ ఆదాయం ఉన్న వారికి రూ.లక్ష వరకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించనున్నారు. రుణాలు తీసుకున్న వారు కేవలం 2 శాతం వడ్డీ కడితే చాలు. మరో ఆరు శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది.
