Corona Cases: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లోనే 16 మంది మృత్యువాత..
దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 757 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Corona Cases: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 757 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఒక్క రోజులోనే 16 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం నాడు నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 6,22,851 కు చేరింది. ఇక మృతుల సంఖ్ 10,453కి చేరింది. కాగా ఇవాళ ఒక్కరోజు 939 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు. మొత్తంగా చూసుకుంటే 6,05,685 మంది కరోనా జయించి క్షేమంగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 97.24 శాతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో 6,713 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉండగా, వాతావరణంలో మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రంగా పెరుగుతోందని, ఫలితంగా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇదిలాఉండగా, ఢిల్లీలో ప్రజలకు వ్యాక్సినేషన్ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ జనవరి 3వ తేదీ లోపు పోలీసులు తమ వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలంటూ ఆ శాఖ ఉన్నధికారులు ఆదేశించారు. ఆ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించిన వివరాలను మెసేజ్ ద్వారా తెలియజేస్తారని, ఆ కారణంగా వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని ఆదేశించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
Also read:
2020 Round-up : 2020లో ఈ లోకాన్ని వీడి అభిమానులను శోకసంద్రంలోకి నెట్టిన సినీ తారలు..
అజింక్య రహానే ఆటతీరుపై సీనియర్ల ప్రశంసలు..కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించాడు అంటూ ట్వీట్
Delhi CMO Tweet:
?Delhi Health Bulletin – 27th December 2020?#DelhiFightsCorona pic.twitter.com/F30eSD3tLn
— CMO Delhi (@CMODelhi) December 27, 2020