AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులు

ఆంధ్రప్రదేశ్‌లో తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులను పంపిస్తామని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల ఆందోళన వద్దని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం...

తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 25, 2020 | 7:39 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో తోపుడు బండ్ల ద్వారా.. ఇళ్ల వద్దకే సరుకులను పంపిస్తామని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల ఆందోళన వద్దని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని జయించవచ్చన్నారు. అలాగే వైద్య సేవలు అందించేందుకు రిటైర్ అయిన డాక్టర్లు, నర్సుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. అలాగే ప్రజలు తప్పకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. నిత్యావసర వస్తువుల దుకాణాలను రోజంతా తెరిచి ఉంచే ఆలోచన కూడా ఉందని ఆయన అన్నారు.

తోపుడు బళ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులను తెచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. కాగా స్వీయ నియంత్రణ పాటిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పారాసిట్ మాల్-650 ఎంజీ వేసుకోవచ్చు కానీ.. యాస్ప్రిన్ వేసుకోవద్దని పీవీ రమేష్ సూచించారు. అలాగే.. డాక్టర్ల సూచనలు లేకుండా అమెరికాలో హైడ్రో క్లోరిక్విన్ వినియోగించి.. ఓ దంపతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని.. కాబట్టి.. ఏ మందులు పడితే అవి వేసుకోవద్దని ఆయన చెప్పారు. అలాగే ప్రతీ కుటుంబానికి బియ్యంతో పాటు వెయ్యి రూపాలయని అందిస్తామని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: 

చేతులకు శానిటైజర్ రాసుకుని.. గ్యాస్ దగ్గరకి వెళ్తున్నారా..?

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

కరోనా బాధితులు తినే ఆహారం ఇదే

రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా