ఆగస్టు 3 న వేలాదిమందికి కోవిడ్-19 వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు వ్యాక్సీన్ కి సంబంధించి మూడో దశ ట్రయల్స్ ని వేలమందికి నిర్వహించనున్నారు. వచ్ఛే నెల 3 న రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో వీటిని నిర్వహించనున్నట్టు..

ఆగస్టు 3 న వేలాదిమందికి కోవిడ్-19 వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2020 | 7:03 PM

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు వ్యాక్సీన్ కి సంబంధించి మూడో దశ ట్రయల్స్ ని వేలమందికి నిర్వహించనున్నారు. వచ్ఛే నెల 3 న రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో వీటిని నిర్వహించనున్నట్టు రష్యా అధికారి ఒకరు తెలిపారు. రష్యన్ ఫండ్ ఆఫ్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ హెడ్ క్రిల్ డిమిట్రియెవ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తమ దేశం మొత్తం 26 వ్యాక్సీన్లను తయారు చేస్తోందని, వాటిలో ‘ గమలేయా నేషనల్  రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెర్మాలజీ, అండ్ మైక్రో బయాలజీ’ అనే సంస్థ   ఒకటని అన్నారు. తొలి దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. అలాగే వెక్టార్ అనే మరో సంస్థ కూడా మరో వ్యాక్సిన్ తయారు చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కోసం సంబంధిత అధికారుల అనుమతిని కోరుతోంది.

కాగా రష్యన్ అధికారి ఒకరు ఇలా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పై స్పష్టంగా తేదీతో సహా ప్రకటించడం, అది కూడా ఆయా దేశాలను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఇటీవల ఆగస్టు రెండు లేదా మూడో వారంలో వీటిని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా క్రిల్ డిమిట్రియెవ్ అధికారికంగా ఈ ప్రకటన చేయడాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు