Breaking: తెలంగాణలో కరోనాతో ఆరుగురు మృతి..
Coronavirus Updates: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి బారిన పడి ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు […]

Coronavirus Updates: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి బారిన పడి ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు.
వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. కాగా, ఇవాళ కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందటంతో తెలంగాణలో మృతుల సంఖ్య 7కు చేరింది.
మరోవైపు దేశంలో ఒక్కరోజే 227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో అత్యధికం నిజాముద్దీన్ తబ్లిఘి- జమాత్ కారణంగా వ్యాప్తి చెందినవే అని తెలుస్తోంది. అటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1251కు చేరుకుంది.
ఇవి చదవండి:
దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…




