కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?

COVID 19: యావత్ ప్రపంచం మీదకు ఏదైనా విపత్తు వస్తే చాలు.. దాని గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ముందే చెప్పారని.. లేదా నాస్ట్రోడామన్ చెప్పిందే జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలవుతాయి. వీటిల్లో ఎక్కువగా అవాస్తవాలే ఉంటాయి కూడా. ఇదిలా ఉంటే ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ప్రపంచం ఎదుర్కునే విపత్కర పరిస్థితులు గురించి ముందే హెచ్చరించాడు. దీనికి గ్రహాలు, వాటి స్థితిగతుల్ని కూడా ప్రస్తావిస్తూ ఉదాహరణలతో చెప్పిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో […]

కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?
Follow us

|

Updated on: Mar 30, 2020 | 10:52 AM

COVID 19: యావత్ ప్రపంచం మీదకు ఏదైనా విపత్తు వస్తే చాలు.. దాని గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ముందే చెప్పారని.. లేదా నాస్ట్రోడామన్ చెప్పిందే జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలవుతాయి. వీటిల్లో ఎక్కువగా అవాస్తవాలే ఉంటాయి కూడా. ఇదిలా ఉంటే ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ప్రపంచం ఎదుర్కునే విపత్కర పరిస్థితులు గురించి ముందే హెచ్చరించాడు. దీనికి గ్రహాలు, వాటి స్థితిగతుల్ని కూడా ప్రస్తావిస్తూ ఉదాహరణలతో చెప్పిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మైసూర్‌కు చెందినా అభిగ్య ఆనంద్ అనే 14 ఏళ్ల పిల్లాడు 2019, ఆగష్టు 22న తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రపంచం మొత్తం నవంబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020 వరకు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ ఆరు నెలల వ్యవధిలో ప్రపంచం ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుందని.. దానితో ఆర్ధిక రంగం పూర్తిగా క్షీణిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక 2020 మే 29 తర్వాత ఈ విపత్తు పూర్తిగా తగ్గిపోతుందంటూ ప్రతి పాయింట్ వెనుకున్న థియరీని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది.

మరోవైపు ప్రపంచ ఆర్ధిక పరిస్థితిని.. అమెరికా- యూరోప్ దేశాలు ఎదుర్కునే ఇబ్బందులను ప్రస్తావించాడు. ఇలా అతడు చెప్పిన అనేక అంశాలు ప్రస్తుతం ఎదుర్కుంటున్నవే అనే చెప్పక తప్పదు. అసలు ఆ కుర్రాడి బ్యాగ్రౌండ్ ఏంటో చూస్తే.. పదేళ్లకే అభిగ్య ఆనంద్ భగవద్గీతలోని 700 శ్లోకాల్ని అనర్గళంగా చెప్పేస్తాడు. అలాగే జోతిష్యం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేసిన టక్కున సమాధానాలు చెబుతాడు. అయుర్వేదిక్ మైక్రో బయాలజీలో పీజీ చేసిన ఆనంద్ ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ కూడా పూర్తి చేశాడు. కాగా, చిన్న వయసులోనే ఇంతటి అద్భుతమైన ప్రావీణ్యన్ని గుర్తించిన గుజరాత్ ప్రభుత్వం మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేద విశ్వవిద్యాలయం అతడ్ని ప్రొఫెసర్‌గా నియమించింది.

ఇవి చదవండి:

 దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

కరోనా విలయ తాండవం.. కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్..