కరోనా అప్డేట్స్: తెలంగాణలో 40 కొత్త కేసులు..!
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 40 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 33 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా.. మరో ఏడు వలసదారుల్లో నమోదయ్యాయి.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 40 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 33 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా.. మరో ఏడు వలసదారుల్లో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,454కి చేరింది. ఇక ఈ రోజు 13 మంది డిశ్చార్జి కాగా.. 461 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య 34గా ఉంది. కాగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటో మొబైల్ షో రూములు, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఏపీలో కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 102 కేసులు నమోదయ్యాయి. అందులో 57 కేసులు రాష్ట్రంలోవి కాగా.. 45 కేసులు ఇతర రాష్ట్రాలకు చెందినవి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,157కు చేరింది.
Read This Story Also: Breaking: రేపటి నుంచి తెలంగాణలో మరిన్ని సడలింపులు.. వాటికి అనుమతి..!