ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం..

కరోనా వైరస్ విషయంలో నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని.. తన మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ 19 నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కలిసి మెలిగిన వారు పరీక్షులు చేయించుకుని, వైద్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన విచారం వ్యక్తం […]

ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం..
Follow us

|

Updated on: Apr 12, 2020 | 8:05 AM

కరోనా వైరస్ విషయంలో నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని.. తన మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ 19 నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కలిసి మెలిగిన వారు పరీక్షులు చేయించుకుని, వైద్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు.

అంతకముందు నారాయణ స్వామి.. మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌తో దేశ ప్ర‌జ‌లంతా ఇళ్లకే పరిమితమైతే.. వీళ్లు మాత్రం ఢిల్లీకి వెళ్లి ఫంక్షన్లు చేసుకుని, ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వైరస్ అంటిస్తున్నారని నారాయణ స్వామి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన ముస్లింలు కూడా డాక్టర్లకు సహకరించడం లేదని.. సామాజిక దూరాన్ని పాటించడం లేదని.. ఇప్పటికైనా వారు పద్దతి మార్చుకోవాలన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: లాక్ డౌన్ పొడిగిస్తే.. ముందు వీటిని సమకూర్చండి.. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వైరల్..