AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌ న్యూస్.. ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా మరో 80 కేసులు..

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎనమిది వందల మార్క్‌ నుంచి తొమ్మిది వందల దిశగా వెళ్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 898కు చేరింది. ఇప్పటి వరకు కరోనాను జయించి 141 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 725 ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి […]

బ్రేకింగ్‌ న్యూస్.. ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా మరో 80 కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 3:33 PM

Share

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎనమిది వందల మార్క్‌ నుంచి తొమ్మిది వందల దిశగా వెళ్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 898కు చేరింది. ఇప్పటి వరకు కరోనాను జయించి 141 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 725 ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి మొత్తం 27 మంది మృతిచెందారని.. అందులో గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతిచెందారని తెలిపారు.

ఇక జిల్లాల వారీగా కేసుల వివరాలు..

అనంతపురం – 42 చిత్తూరు – 73 తూర్పు గోదావరి – 32 గుంటూరు – 195 కడప – 51 కృష్ణా – 88 కర్నూల్ – 234 నెల్లూరు – 67 ప్రకాశం – 50 విశాఖ – 22 పశ్చిమ గోదావరి – 39