Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid19: దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఏమాత్రం తగ్గని మరణాల సంఖ్య

దేశంలో గత కొన్ని రోజులుగా దడపుట్టిస్తున్న కరోనా వైరస్ మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతోంది. గ‌డిచిన24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి.

Covid19: దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఏమాత్రం తగ్గని మరణాల సంఖ్య
Follow us
Balaraju Goud

|

Updated on: May 15, 2021 | 10:37 AM

India Coronavirus Cases: దేశంలో గత కొన్ని రోజులుగా దడపుట్టిస్తున్న కరోనా వైరస్ మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతోంది. నిన్న 3.40 ల‌క్షల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా 3.26 ల‌క్షల‌కు దిగివచ్చాయి. అయితే మృతుల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలావుంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 36,73,802 కేసులతో యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు దేశంలో కరోనా మహమ్మారి బారినపడి 2,66,207 మంది బాధితులు ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్పటివ‌ర‌కు కొత్తగా 3,53,299 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు, కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగంగా కొన‌సాగుతోంది. ఇప్పటివ‌ర‌కు 18,04,57,579 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామ‌ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, దేశంలో మొత్తం క‌రోనా ప‌రీక్షల సంఖ్య 31,30,17,193కు చేరింద‌ని భార‌తీయ‌ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్రక‌టించింది. నిన్న ఒకేరోజు 16,93,093 మందికి ప‌రీక్ష‌లు నిర్వహించామ‌ని వెల్ల‌డించింది.

Read Also…  Cyclone Tauktae: తీరంలో అలజడి.. భీకరంగా మారుతున్న తుఫాను.. బుసలు కొడుతున్న తౌక్తా

దుర్గమ్మ దర్శనానికి ఏటా రెండు కోట్ల మందికిపైగా భక్తుల రాక
దుర్గమ్మ దర్శనానికి ఏటా రెండు కోట్ల మందికిపైగా భక్తుల రాక
కోచింగ్‌ పేరుతో కామ క్రీడ.. మైనర్లే అతని టార్గెట్‌!
కోచింగ్‌ పేరుతో కామ క్రీడ.. మైనర్లే అతని టార్గెట్‌!
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ వీడియో
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ వీడియో
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే?
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే?
ఇంజనీరింగ్ అద్భుతం.. పంబన్‌ వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఇంజనీరింగ్ అద్భుతం.. పంబన్‌ వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
బియ్యం గింజలపై శ్రీరామ నామం.. ఆధ్యాత్మికతను చాటుతున్న కళాకారిణి
బియ్యం గింజలపై శ్రీరామ నామం.. ఆధ్యాత్మికతను చాటుతున్న కళాకారిణి
స్టార్‌ హీరోలకు లక్కీ హీరోయిన్‌గా రష్మిక మందన్నా.. లిస్టు చూశారా?
స్టార్‌ హీరోలకు లక్కీ హీరోయిన్‌గా రష్మిక మందన్నా.. లిస్టు చూశారా?
త్వరలోనే ఏపీకి 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు!
త్వరలోనే ఏపీకి 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు!
చైత్ర నవమి రోజున దెయ్యాల ఉత్సవం.. 100 ఏళ్ల చరిత్ర ఉన్న వేడుక..
చైత్ర నవమి రోజున దెయ్యాల ఉత్సవం.. 100 ఏళ్ల చరిత్ర ఉన్న వేడుక..
నోయిడాలో సాఫ్ట్‌వేర్ హత్య..కారణాలు తెలిస్తే షాక్!
నోయిడాలో సాఫ్ట్‌వేర్ హత్య..కారణాలు తెలిస్తే షాక్!