AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్.. ప్రజలకు కేంద్రం సూచనలు..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు, మరణాలు సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది. అయితే ఈ లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితి చేస్తూ మిగతా చోట్ల దశలవారీగా కార్యకలాపాలు సాగించేందుకు పలు సడలింపులు కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే మొదటిదశగా జూన్ 8న హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆతిధ్య రంగ సేవలు, ప్రార్ధనా మందిరాలను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. […]

కరోనా ఎఫెక్ట్.. ప్రజలకు కేంద్రం సూచనలు..
Ravi Kiran
|

Updated on: May 31, 2020 | 5:46 PM

Share

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు, మరణాలు సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది. అయితే ఈ లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితి చేస్తూ మిగతా చోట్ల దశలవారీగా కార్యకలాపాలు సాగించేందుకు పలు సడలింపులు కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే మొదటిదశగా జూన్ 8న హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆతిధ్య రంగ సేవలు, ప్రార్ధనా మందిరాలను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. అంతేకాక ప్రజలందరూ కూడా కరోనా మార్గదర్శకాలు పాటించాలని.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం మెయింటైన్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

మరోవైపు కరోనా నేపథ్యంలో కొన్ని సూచనలు కేంద్రం కూడా ఇచ్చింది. వైరస్ బారిన ఎక్కువగా వృద్దులు, చిన్న పిల్లలు పడతారని నిపుణులు చెప్పడంతో.. 65 ఏళ్లకు పైబడిన వాళ్లు, 10 ఏళ్లలోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అంతేకాక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా బయటికి రావొద్దని తెలిపింది. ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అలాగే ఆరోగ్య సేతు యాప్ ను కూడా ప్రతీ ఒక్కరూ ఇన్ స్టాల్ చేసుకోవాలంది.