Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఏపీలో 3, తెలంగాణలో 16.. తెలుగురాష్ట్రాల్లో పెరుగుతోన్న కరోనా కేసులు

భారతదేశంలో చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. మొత్తం 20 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. బాధితుల సంఖ్య 200కు దగ్గరవుతుండగా..

Coronavirus: ఏపీలో 3, తెలంగాణలో 16.. తెలుగురాష్ట్రాల్లో పెరుగుతోన్న కరోనా కేసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 20, 2020 | 8:26 AM

భారతదేశంలో చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. మొత్తం 20 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. బాధితుల సంఖ్య 200కు దగ్గరవుతుండగా.. వేలల్లో అనుమానితులున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య 16కు చేరింది. ఇక అటు ఏపీలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 65ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వారు తెలిపారు. ఇటీవల ఆయన మక్కాకు వెళ్లి వచ్చారని.. ఆ తరువాత రెండుసార్లు హైదరాబాద్‌లోని ఆయన కుమార్తె ఇంటికి కూడా వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3కు చేరింది. ఇదిలా ఉంటే వైరస్‌కు అడ్డుకట్టవేసేందుకు అటు, ఇటు కేంద్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే విద్యా సంస్థలను బంద్ చేయించిన ప్రభుత్వాలు.. ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇచ్చాయి.

Read This Story Also: మానవ మృగాలను ఉరి తీశారిలా..!