AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాజ్‌మహల్ మూసేయాల్సిందే.. కేంద్రానికి ఆగ్రా మేయర్ లేఖ..!

తాజ్ మహల్.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఈ ప్రాచీన కట్టడం గురించి తెలిసిందే. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ఈ తాజ్‌ను ఇప్పుడు మూసేయాలంటూ ఆగ్రా మేయర్ నవీన్ జైన్ కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు దేశీయులే కాకుండా.. అనేక మంది విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన వారు.. దాదాపుగా ఈ ప్రదేశాన్ని చూడకుండా వెళ్లరు. ఇటీవల భారత్ టూర్‌కు వచ్చిన […]

తాజ్‌మహల్ మూసేయాల్సిందే.. కేంద్రానికి ఆగ్రా మేయర్ లేఖ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 07, 2020 | 9:00 PM

Share

తాజ్ మహల్.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఈ ప్రాచీన కట్టడం గురించి తెలిసిందే. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ఈ తాజ్‌ను ఇప్పుడు మూసేయాలంటూ ఆగ్రా మేయర్ నవీన్ జైన్ కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు దేశీయులే కాకుండా.. అనేక మంది విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన వారు.. దాదాపుగా ఈ ప్రదేశాన్ని చూడకుండా వెళ్లరు. ఇటీవల భారత్ టూర్‌కు వచ్చిన అగ్రరాజ్యాధిపతి ట్రంప్ కూడా.. తాజ్‌మహల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకున్న సంగతి తెలిసిందే.

తాజ్‌మహల్‌‌ను చూసేందుకు నిత్యం విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆగ్రాకు వస్తున్నారని.. ఒకవేళ వారిలో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే.. నగరంలో వ్యాపించే అవకాశాలున్నాయని ఆగ్రా మేయర్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ.. తాజ్‌మహల్‌‌తోపాటు ఫతేపూర్ సిక్రీ కోట, ఆగ్రాలోని కోట, ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని.. ఇక్కడికి పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు ఇప్పటికే యూపీలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాజాగా.. తాజ్‌‌ను సందర్శించేందుకు వచ్చిన 2,915 మంది విదేశీ పర్యాటకులను ఆగ్రా జిల్లా వైద్యాధికారులు పరీక్షించగా.. వారిలో 708 మందిని హోంఐసోలేషన్‌కు తరలించారని అధికారులు తెలిపారు. కాగా.. ముగ్గురు విదేశీ పర్యాటకులకు కరోనా వైరస్ లక్షణాలను గుర్తించిన అధికారులు.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆగ్రా వైద్యాధికారులు చెప్పారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర