AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Second Wave: కోవిండ్ సెకండ్ వేవ్ యమ డేంజర్… వారికీ ఎక్కువ రిస్కే అంటున్న వైద్య నిపుణులు..

Corona Second Wave: ప్రస్తుతం ఎక్కడ చూసినా.. కరోనా సెకండ్‌ వేవ్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కరోనా విలయం కాస్త తగ్గుముఖం పడుతుందని అంతా సంతోషిస్తోన్న సమయంలో మళ్లీ...

Corona Second Wave: కోవిండ్ సెకండ్ వేవ్ యమ డేంజర్... వారికీ ఎక్కువ రిస్కే అంటున్న వైద్య నిపుణులు..
Corona In Kids
Narender Vaitla
|

Updated on: Apr 16, 2021 | 4:58 PM

Share

Corona Second Wave: ప్రస్తుతం ఎక్కడ చూసినా.. కరోనా సెకండ్‌ వేవ్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కరోనా విలయం కాస్త తగ్గుముఖం పడుతుందని అంతా సంతోషిస్తోన్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌ రూపంలో కరోనా తన పంజాను విసురుతోంది. ప్రస్తుతం గతేడాదిని మించి కేసులు నమోదవుతున్నాయి. రోజుకి ఏకంగా 2 లక్షలు కేసులు నమోదవుతున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఫస్ట్ వేవ్‌ సమయంలో పిల్లలు పెద్దగా కరోనా బారిన పడినట్లు వార్తలు రాలేవు. అయితే తాజాగా వ్యాపిస్తోన్న సెకండ్‌ వేవ్‌ చిన్నారులను కూడా వెంటాడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 1 నుంచి 5 ఏళ్లలోపు వారికి ఈ వైరస్‌ అటాక్‌ చేస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2020తో పోలిస్తే..చిన్నారుల్లో కరోనా కేసుల నమోదు ఏకంగా 5 రెట్లు పెరిగాయి. ఢిల్లీలోని ప్రముఖ ఎల్‌ఎన్‌జీపీ ఆసుపత్రికి చెందిన వైద్యులు రీతు సక్సెనా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో 15 నుంచి 30 ఏళ్ల మధ్యలో వారికి ఎక్కువగా కరోనా సోకుతున్నట్లు రీతూ చెప్పుకొచ్చారు. చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా కేవలం ఒక్క రోజులోనే 16,699 కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 24 గంటల్లోనే 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వరసగా తొమ్మిదో రోజు కూడా లక్షకు పైగా కరోనా బాధితులు సంఖ్యా నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‏కు కొవిడ్ పాజిటివ్.. కొనసాగుతున్న చికిత్స.. అధికారికంగా ప్రకటించిన జనసేన టీం..

COVID-19: మట్టిలో నెలరోజుల పాటు సజీవంగానే కరోనా వైరస్..కొత్త టెన్షన్ పుట్టిస్తున్న తాజా పరిశోధనలు!

Indiana: ఇండియానాలో కాల్పుల కలకలం.. ఆగంతకుని కాల్పుల్లో 8 మంది మృతి!