AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా.. 37 వేలు దాటిన కరోనా కేసులు.. పెరిగిన రీకవరీ రేటు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులో 2,411 కేసులు నమోదు కాగా.. మొత్తం ఈ సంఖ్య 37,776  కి చేరింది. 1,223 మంది కరోనా రోగులు మరణించారు.   గత 24 గంటల్లో 71 మంది మృత్యుబాట పట్టారు.   ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్ నగరాలను ‘రెడ్ జోన్లు’ గా ప్రకటించారు. ఇక శనివారం నాటికి రీకవరీ రేటు 26.64 శాతంగా ఉంది. మొత్తం 10,018 మంది రోగులు కోలుకున్నారు. ఏప్రిల్ 15-30 […]

Umakanth Rao
| Edited By: |

Updated on: May 02, 2020 | 8:10 PM

Share

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులో 2,411 కేసులు నమోదు కాగా.. మొత్తం ఈ సంఖ్య 37,776  కి చేరింది. 1,223 మంది కరోనా రోగులు మరణించారు.   గత 24 గంటల్లో 71 మంది మృత్యుబాట పట్టారు.   ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్ నగరాలను ‘రెడ్ జోన్లు’ గా ప్రకటించారు. ఇక శనివారం నాటికి రీకవరీ రేటు 26.64 శాతంగా ఉంది. మొత్తం 10,018 మంది రోగులు కోలుకున్నారు. ఏప్రిల్ 15-30 మధ్య కరోనా హాట్ స్పాట్స్ సంఖ్య 170 నుంచి 130 కి, గ్రీన్ జోన్ల సంఖ్య 356 నుంచి 319 కి తగ్గింది.

ఇలా ఉండగా.. కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లను అభినందించేందుకు సాయుధ దళాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతిస్తూ ట్వీట్లు చేశారు.