వావ్ ఎల్ఈడీ లైట్ల మాస్క్.. నవ్వితే స్మైలీ గుర్తు..
గేమ్ డిజైనర్, ప్రోగ్రామర్ అయిన టెలర్ గ్లోయల్ ప్రత్యేక మాస్కులను రూపొందించారు. ఇది ధరించిన వారు మాట్లాడుతున్నప్పుడు ఎల్ఈడీ లైట్లు మిణుమిణుకుమంటూ వెలుగుతూంటాయి. తద్వారా మనిషి భావాలను అర్థం చేసుకోవచ్చు. ఈ ఎల్ఈడీ లైట్ల మాస్క్ ధరించిన వారు నవ్వినప్పుడు...
కరోనా వైరస్ కారణంగా ఇకపై భవిష్యత్తులో కూడా మాస్క్ మన జీవితంలో ఒక భాగం కానుంది. అయితే ఇదే ఇప్పుడు పలువురికి ఉపాధిగా మారింది. ఇప్పటికే చాలా మంది మాస్కులను వివిధ రకాలుగా డిజైన్ చేసి మార్కెట్లో ప్రవేశ పెడుతున్నారు. ఫేస్ మాస్క్లంటూ ఇటీవలే కొత్తగా కొన్ని వచ్చాయి కూడా. మరికొంతమంది వ్యాపారులు తమ బిజినెస్ని పెంచుకునేందుకు చిన్నపిల్లలకు ప్రతేక్యంగా మాస్కులను తయారు చేస్తున్నారు. కాగా ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎల్ఈడీ లైట్ల మాస్క్ కొత్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీని ప్రత్యేకతలేంటంటే.. నవ్వితే స్మైలీ గుర్తు, కోపంగా ఉంటే.. బుంగబూతి గుర్తులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది జనాల్ని బాగా ఆకర్షింస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. గేమ్ డిజైనర్, ప్రోగ్రామర్ అయిన టెలర్ గ్లోయల్ ప్రత్యేక మాస్కులను రూపొందించారు. ఇది ధరించిన వారు మాట్లాడుతున్నప్పుడు ఎల్ఈడీ లైట్లు మిణుమిణుకుమంటూ వెలుగుతూంటాయి. తద్వారా మనిషి భావాలను అర్థం చేసుకోవచ్చు. ఈ ఎల్ఈడీ లైట్ల మాస్క్ ధరించిన వారు నవ్వినప్పుడు మాస్క్పై స్మైలీ గుర్తు ఏర్పడుతుంది. ఈ మాస్క్లో మొత్తం 16 ఎల్ఈడీ లైట్లు ఉంటాయి.
కాగా దీనిని తయారు చేసిన అమెరికన్ ప్రోగ్రామర్ టెలర్ మాట్లాడుతూ.. ఈ మాస్కులో ఎల్ఈడీకి కనెక్ట్ చేసిన వాయిస్ ప్యానెల్ ఉందని, దీన్ని ఆన్లైన్లో చూసి తయారు చేసినట్లు చెప్పారు. అలాగే ఈ మాస్క్ తయారు చేయడానికి నెల రోజుల సమయం పట్టిందట. దీనిని క్లాత్తోనే తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిలో ఎల్ఈడీ బల్బులు వెలిగేందుకు 9 వాల్టుల బ్యాటరీ అమర్చినట్లు తెలిపారు. ఇది తయారు చేసేందుకు 3 వేల రూపాయలు ఖర్చు అయినట్లు టేలర్ చెప్పారు. అయితే ఈ మాస్క్ పిల్లలు ధరించేందుకు తగినది కాదని ఆయన పేర్కొన్నారు.
— Tyler Glaiel (@TylerGlaiel) May 25, 2020
Read More:
నోకియా ఎక్స్ప్రెస్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు..
పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్వో