సీఎం జగన్ ఆర్డర్ః మరణించిన వారికి 24గంటల్లో పరిహారం..
కోవిడ్ దెబ్బకు వణికిపోతున్న ఏపీని అకాల వర్షం ముంచేసింది. పలు జిల్లాలో పిడుగులు పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తన గొప్ప మనసు చాటుకున్నారు. మృతులకు ఆర్థిక భరోసాను కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఓవైపు కరోనా రక్కసి కోరలు చాస్తోంది. మరోవైపు ప్రకృతి ప్రతాపం చూపిస్తోంది. కోవిడ్ దెబ్బకు వణికిపోతున్న ఏపీని అకాల వర్షం ముంచేసింది. గురువారం ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రాష్ట్రం అల్లాడిపోయింది. భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి. వర్షం, గాలుల దెబ్బకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల దెబ్బకు కొన్ని జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.. చెట్లు విరిగిపడ్డాయి. పలు జిల్లాలో పిడుగులు పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తన గొప్ప మనసు చాటుకున్నారు. మృతులకు ఆర్థిక భరోసాను కల్పించారు.
రాష్ట్రంలో గురువారం కురిసిన వర్షాల ధాటికి పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించిన వారికి 24 గంటలల్లో పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా వైరస్ (కోవిడ్ 19) నివారణ చర్యలపై జిల్లాల కలెక్టర్లు, వైద్య సిబ్బందితో శుక్రవారం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణా చర్యలు, తాజా పరిణామాలు, లాక్ డౌన్ పరిస్థితులపై జగన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా నియంత్రణా చర్యల్లో నిమగ్నమైన జిల్లా కలెక్టర్లు, కోవిడ్ ఆస్పత్రుల వైద్యులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా మీద చేస్తున్న యుద్ధంలో కలెక్టర్లు, వైద్య వర్గాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం వారిని ప్రశంసించారు.