కోట్లల్లో సీసీసీ ఛారిటీ విరాళాలు..మొత్తం లెక్కలు చెప్పిన చిరంజీవి
కరోనా వైరస్ నేపథ్యంలో పేద కళాకారులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్కు చిరంజీవి స్వయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు ...
ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు భారత్ను పట్టిపీడిస్తోంది మహమ్మారి కరోనా వైరస్. దీనిని నియంత్రించేందుకు యావత్ భారతావని ఇప్పుడు యుద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేని ఈ వైరస్ భూతాన్ని అరికట్టాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గం లాక్డౌన్. దీంతో అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. కోవిడ్ -19 దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ మహమ్మారి ప్రభావం సినిమా రంగం కూడా అతలాకుతలం అవుతోంది. షూటింగ్లన్నీ ఆగిపోయాయి. చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పెద్దలందరూ కలిసి ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. దీనికి విరాళాలు అందించాల్సిందిగా సినీ ప్రముఖులను స్వయంగా చిరంజీవి అభ్యర్థించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో పేద కళాకారులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్కు చిరంజీవి స్వయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు. ఎవరి శక్తిమేర వారు విరాళాలు అందజేశారు. మార్చి 28న ఈ ఛారిటీని ఏర్పాటు చేయగా నాలుగు రోజుల్లో రూ.6.2 కోట్ల విరాళాలు అందాయి. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా రూ.6.2 కోట్లు సేకరించాం. ఈ నిధికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నా’’ అంటూ చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ఇచ్చినవారి వివరాలు:
– చిరంజీవి – కోటి రూపాయలు
– నాగార్జున – కోటి రూపాయలు
– ప్రభాస్ – రూ.50 లక్షలు
– రామ్ చరణ్ – రూ. 30 లక్షలు
– నాని – రూ. 30 లక్షలు
– ఎన్టీఆర్ – రూ. 25 లక్షలు
– నాగచైతన్య – రూ. 25 లక్షలు
– అల్లు అర్జున్ – రూ. 20 లక్షలు
– వరుణ్ తేజ్ – రూ. 20 లక్షలు
– రవితేజ – రూ. 20 లక్షలు
– శర్వానంద్ – రూ. 15 లక్షలు
– శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – రూ. 10 లక్షలు
– యూవీ క్రియేషన్స్ – రూ. 10 లక్షలు
– సాయిధరమ్ తేజ్ – రూ. 10 లక్షలు
– విశ్వక్ సేన్ – రూ. 5 లక్షలు
– శ్రీకాంత్ – రూ. 5 లక్షలు
– శ్రీమిత్ర చౌదరి – రూ. 5 లక్షలు
– సుశాంత్ – రూ. 2 లక్షలు
– కార్తికేయ – రూ. 2 లక్షలు
– వెన్నెల కిషోర్ – రూ. 2 లక్షలు
– సప్తగిరి – రూ. 2 లక్షలు
– లావణ్య త్రిపాఠి – రూ. 1 లక్ష
– సంపూర్ణేష్ బాబు – రూ. 1 లక్ష
– బ్రహ్మాజీ – రూ. 70వేలు
అంతేకాకుండా, ఎవరైనా విరాళాలు ఇవ్వాలని భావిస్తే తమ కరోనా క్రైసిస్ ఛారిటీ స్పెషల్ సేవింగ్ అకౌంట్కు పంపొచ్చన్నారు. ఈ మేరకు విరాళాలు పంపాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలు వెల్లడించారు.
బ్యాంక్: ఐసీఐసీఐ, బంజారాహిల్స్ బ్రాంచ్, అకౌంట్ నంబర్: 0076 01 019951,
ఐఎఫ్ఎస్సీ కోడ్: ICIC0000076.