AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అదుపుపై మూడు దేశాలతో చైనా చర్చలు

కరోనా అదుపుపై చైనా మూడు దేశాలతో చర్చలు జరిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాల విదేశాంగ మంత్రులతో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ వర్చ్యువల్ గా చర్చించారు. దీనితో బాటు ఎకనమిక్ రీకవరీని పెంచడం, తమ నాలుగు దేశాల పరిధిలో రోడ్డు ప్రాజెక్టులను, కారిడార్ల నిర్మాణాలను చేపట్టడం వంటి ఇతర అంశాలు కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఆఫ్ఘన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మహమ్మద్ హనీఫ్ అత్మర్, నేపాల్ మంత్రి ప్రదీప్ కుమార్ […]

కరోనా అదుపుపై మూడు దేశాలతో చైనా చర్చలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 10:46 AM

Share

కరోనా అదుపుపై చైనా మూడు దేశాలతో చర్చలు జరిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాల విదేశాంగ మంత్రులతో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ వర్చ్యువల్ గా చర్చించారు. దీనితో బాటు ఎకనమిక్ రీకవరీని పెంచడం, తమ నాలుగు దేశాల పరిధిలో రోడ్డు ప్రాజెక్టులను, కారిడార్ల నిర్మాణాలను చేపట్టడం వంటి ఇతర అంశాలు కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఆఫ్ఘన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మహమ్మద్ హనీఫ్ అత్మర్, నేపాల్ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యాతలి ఈ వర్చ్యువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం నాలుగు పాయింట్లపై చైనా ఈ దేశాలతో చర్చించింది. కరోనా వ్యాప్తి నివారణకు పరస్పర ప్రాంతీయ సహకారం, ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకోవడం వంటి వాటికి ఈ చర్చల్లో అత్యంత ప్రాధాన్యమిచ్చారు.

పొరుగునఉన్న నేపాల్ లో ఇటీవల తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని తనకు అనువుగా మలచుకోవడానికి చైనా ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుంది. ఇండియాతో పాకిస్థాన్ కు గల విభేదాలను కూడా తన ప్రయోజనార్థం వినియోగించుకోవడానికే చైనా.. కరోనా ముసుగులో ఈ కుయుక్తి పన్నినట్టు రాజకీయ విశేషకులు అభిప్రాయపడుతున్నారు.