AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో కేసులు..

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు అరలక్షకు చేరువలో కేసులు నమోదవుతుండటంతో.. ప్రజలు భయబ్రాంతులకు..

దేశంలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 10:15 AM

Share

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు అరలక్షకు చేరువలో కేసులు నమోదవుతుండటంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తిరిగి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 47,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని 9,51,744 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,96,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 654 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 33,425 మంది మరణించారు.

కాగా, దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర,తమిళనాడు నుంచే నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌,కర్ణాటక నుంచి నమోదవుతున్నాయి.