AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆత్మ నిర్భర్ 5.0 కీలకాంశాలు.. ఇదే చివరి ప్రకటన.. !

ఆత్మ నిర్భర్ 5.0లోని కీలకాంశాలు ప్రకటిస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇదే చివరి ప్రకటన అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు రంగాలకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను..

ఆత్మ నిర్భర్ 5.0 కీలకాంశాలు.. ఇదే చివరి ప్రకటన.. !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 17, 2020 | 11:32 AM

Share

ఆత్మ నిర్భర్ 5.0లోని కీలకాంశాలు ప్రకటిస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇదే చివరి ప్రకటన అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు రంగాలకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తున్నారు. చివరి ప్యాకేజీలో ఏడు రంగాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. పేదలు, వలసకూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత అన్నారు. 8.19 కోట్ల మంది రైతులకు సాయం అందించామన్నారు. రాష్ట్రాలకు తగిన విధంగా సాయం చేస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు. అందుకే పేదలకు నేరుగా నగదును బదిలీ చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల “ఆత్మనిర్భర్ భారత్” ప్యాకేజీకి సంబంధించి రోజుకో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నాడు కూడా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏవియేషన్, టూరిజమ్ రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణలను ప్రతిపాదించారు. అధికంగా ప్రైవేటీకరణపై దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. ఇక విద్యుత్ బోర్డుల దగ్గరి నుంచి మొదలుకొని ఎయిర్ పోర్ట్‌ల వరకు వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Read More:

ఏపీలో ప్రారంభం కానున్న సినిమా హాళ్లు, రెస్టారెంట్లు!

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ