AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌లో క్రికెట్ మ్యాచ్.. బీజేపీ నేత అరెస్ట్..

తాజాగా లాక్ డౌన్ ఉల్లంఘించి క్రికెట్ మ్యాచ్ నిర్వహించినందుకు గానూ బీజేపీ నేతతో సహా 20 మందిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా పనాపూర్ గ్రామంలో బీజేపీ నేత సుధీర్‌సింగ్‌ కొందరు యువకులతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.

లాక్‌డౌన్‌లో క్రికెట్ మ్యాచ్.. బీజేపీ నేత అరెస్ట్..
Ravi Kiran
|

Updated on: Apr 24, 2020 | 1:30 PM

Share

దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఎవ్వరూ కూడా ఇళ్ళ నుంచి బయటకి రాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలాసార్లు చెప్పాయి. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ లాక్ డౌన్‌ను బేఖాతర్ చేస్తూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఇక ఇలాంటివారిపై పోలీసులు పలు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ ఉల్లంఘించి క్రికెట్ మ్యాచ్ నిర్వహించినందుకు గానూ బీజేపీ నేతతో సహా 20 మందిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా పనాపూర్ గ్రామంలో బీజేపీ నేత సుధీర్‌సింగ్‌ కొందరు యువకులతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో 20 మందికి పైగా యువకులతో మ్యాచ్ నిర్వహిస్తున్నారని కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందటంతో అక్కడికి చేరుకొని మ్యాచ్ నిలిపేశామని జిల్లా ఎస్పీ అరవింద్ చతుర్వేదీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేత, మిగిలిన వారిపై సెక్షన్ 269, సెక్షన్ 188 ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్ కోసం.. ఏపీలో సడలింపులు ఇవే.!

ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..

చైనాకు కొత్త తలనొప్పి.. కోటి జనాభా ఉన్న సిటీ లాక్‌డౌన్‌..

వివాదాస్పదంగా మారిన మరో వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ ర్యాలీ…