AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందువల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రబలుతుంటే.. పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌. రవి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణం తబ్లీఘీలతో పాటుగా..అజ్మీర్ దర్శనానికి వెళ్లి వచ్చిన వారేనంటూ మండిపడ్డారు. అక్కడి వెళ్లి వచ్చిన వారంతా కరోనా సోకి.. ఇతరులకు సంక్రమించేలా చేయడమేంటని.. ఇది కుట్ర కాకపోతే మరేంటంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి […]

అందువల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 12, 2020 | 4:57 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రబలుతుంటే.. పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌. రవి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణం తబ్లీఘీలతో పాటుగా..అజ్మీర్ దర్శనానికి వెళ్లి వచ్చిన వారేనంటూ మండిపడ్డారు. అక్కడి వెళ్లి వచ్చిన వారంతా కరోనా సోకి.. ఇతరులకు సంక్రమించేలా చేయడమేంటని.. ఇది కుట్ర కాకపోతే మరేంటంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తబ్లీఘీలు.. పరీక్షలు చేయించుకోండండని కోరినప్పటికీ వారు ముందుకు రాలేదని.. ఇక ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పరీక్షలు చేసేందుకు వెళ్తే.. వారిపై దాడులకు దిగడమేంటని ప్రశ్నించారు. కుట్రలు లేకపోతే.. పరీక్షలు చేయించుకోకుండా.. దాడులు చేయడం దేనికి సంకేతమన్నారు. కాగా.. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయగా.. అధిష్టానం సీరియస్ అయ్యింది. అయినప్పటికీ.. మళ్లీ కొందరు నేతలు సీన్ రిపీట్ చేస్తున్నారు.