AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతి నుంచి బెంగళూరుకు ఆర్టీసీ బస్సులు రెడీ

అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బెంగళూరు (కర్నా టక)కు ఈనెల 17 నుండి సర్వీసులను పునరుద్దరించేందుకు సిద్ధమవుతోంది.

తిరుపతి నుంచి బెంగళూరుకు ఆర్టీసీ బస్సులు రెడీ
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2020 | 9:19 AM

Share

అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బెంగళూరు (కర్నా టక)కు ఈనెల 17 నుండి సర్వీసులను పునరుద్దరించేందుకు సిద్ధమవుతోంది.  తొలుత చిత్తూరు నుంచి 30 బస్సులను నడపాలని, నాలుగు దశల్లో ఆ సంఖ్యను పెంచాలని నిర్ణయించు కుంది. ఈమేరకు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికా రులు అందుకు అవసరమైన ఏర్పాట్లను  చేస్తున్నారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటకకు ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు ఆర్టీసీ అధికారులు. నేటి నుంచి ఓపిఆర్ఎస్ ద్వారా టికెట్ల బుకింగ్ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఇక కర్ణాటక ఆర్టీసీ సైతం చిత్తూరు రీజియన్‌కు 30 బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణీకులు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను, ముందస్తు చర్యలను తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్‌, గ్రౌండ్‌ బుకింగ్‌ ఏర్పాటును కూడా సిద్ధం చేస్తున్నారు.