AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా 733 మందికి పాజిటివ్

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే, నిన్నతో పోల్చితే గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా 733 మందికి పాజిటివ్
Balaraju Goud
|

Updated on: Nov 27, 2020 | 7:11 PM

Share

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే, నిన్నతో పోల్చితే గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా అధికారులు విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 733 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,66,438 కి చేరింది.

కాగా, ఇవాళ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 1,205 మందితో కలుపుని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 8,47,325 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,137 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఆరుగురు ప్రాణాలను వదిలారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,976 కి చేరింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక, గడిచిన 24 గంటల వ్యవధిలో 57,752 సాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 99,13,068 సాంపిల్స్ టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అలాగే, జిల్లా వారీగా చూస్తేః