AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,365 కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 56,720 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,365 మందికి వైరస్ సోకినట్లు తేలింది.

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,365 కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి
Ap Corona
Ram Naramaneni
|

Updated on: Sep 22, 2021 | 5:54 PM

Share

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 56,720 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,365 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2042073కి చేరింది. కొత్తగా 8 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 14097 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,466 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2014180కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13796 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,78,70,218  శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కాగా ప్రమాదకరంగా చిత్తూరు జిల్లాలో 212, తూర్పు గోదావరి జిల్లాలో 210 మందికి వైరస్ సోకింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలను దిగువన చూడండి 

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ●వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.  ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also Read: సంక్షేమమే అజెండా.. అక్టోబర్‌లో వారందరికీ సీఎం జగన్ వరాలు

 అమ్మ ఎగ్​ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య