AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో 10వేల‌కు చేరువలో క‌రోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గటం లేదు. ఏపిలో కరోనా కేసులు 10 వేలకు చేరువగా వచ్చాయి.. గ‌డిచిన 24 గంట‌ల‌లో 20 వేల 639 క‌రోనా...

ఏపీలో 10వేల‌కు చేరువలో క‌రోనా కేసులు
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2020 | 1:56 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గటం లేదు. ఏపీ వ్యాప్తంగా  కరోనా కేసులు 10 వేలకు చేరువుగా వచ్చాయి.. గ‌డిచిన 24 గంట‌ల‌లో 20 వేల 639 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, వాటిల్లో 462 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ కారణంగా 8 మంది మ‌ృతి చెందినట్లు ప్రకటించారు.

ఏపీలో నమోదైన తాజా కేసుల్లో స్థానికంగా 407 కరోనా కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 15 మందికి పాజిటివ్‌‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9,834 కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో ప్రకటించారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, క‌ర్నూలు జిల్లాల‌లో ముగ్గురు మ‌ర‌ణించ‌గా, గుంటూరు, క‌డ‌ప‌ జిల్లాలలో ఒకరొకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 119కి చేరింది. ఏపీలో 5,123 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,592 మంది డిశ్చార్జ్ అయ్యారు.