రాజస్థాన్లో విజృంభిస్తోన్న కరోనా.. తాజాగా మరో 76 కేసులు..
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పటికే 4.75 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరేలా ఉంది.
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పటికే 4.75 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరేలా ఉంది. ఇక నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఇక అన్లాక్ 1.0 నుంచి రాజస్థాన్లో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16వ వేల మార్క్ను దాటేసింది. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,085కి చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 375 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,064 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 12,646 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా జైపూర్, జోధ్పూర్, భరత్పూర్ జిల్లాల్లోనే నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.