AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telecom Policy: గుడ్ న్యూస్.. టెలికాం రంగంలో 10లక్షల ఉద్యోగాలు.. కేంద్రం కొత్త పాలసీ..

భారతదేశాన్ని ప్రపంచ టెలికాం ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం, పరిశోధన, స్టార్టప్‌లు, కొత్త సాంకేతికత, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. ఎన్టీపీ-25 పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. దాదాపు 10లక్షల ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి.

Telecom Policy: గుడ్ న్యూస్.. టెలికాం రంగంలో 10లక్షల ఉద్యోగాలు.. కేంద్రం కొత్త పాలసీ..
Telecom Policy
Krishna S
|

Updated on: Jul 24, 2025 | 8:44 PM

Share

టెలికాం రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తూ కేంద్రం నేషనల్ టెలికాం పాలసీ 2025 ముసాయిదాను విడుదల చేసింది. డిజిటల్ ప్రపంచంలో భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడం ఈ పాలసీ లక్ష్యం. ఈ పాలసీతో ప్రభుత్వం అనేక పెద్ద లక్ష్యాలను నిర్దేశించింది. వాటిలో ప్రతి ఏడాది రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం, 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడం వంటివి ఉన్నాయి.

ప్రతి ఏటా రూ. లక్ష కోట్ల పెట్టుబడి

5G, 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్వాంటం కమ్యూనికేషన్ వంటి సాంకేతిక రంగాలలో దేశాన్ని ప్రపంచంలోని టాప్ 10 ఆవిష్కరణ కేంద్రాలలో ఒకటిగా మార్చడం ఈ విధానం లక్ష్యం. ప్రతి పౌరుడికి వేగవంతమైన, సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం, దేశ జీడీపీలో టెలికాం రంగం వాటాను రెట్టింపు చేయడం, ప్రతి ఏడాది రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం ఎన్టీపీ-25 లక్ష్యాలు.

10 లక్షల మందికి ఉద్యోగాలు..

ముసాయిదా విధానం ప్రకారం.. భారత్ ప్రపంచ టెలికాం ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మారుతుంది. దీని కోసం పరిశోధన, స్టార్టప్‌లు, కొత్త సాంకేతికత, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీని కారణంగా.. పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహకం లభిస్తుంది. 6G టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా భారత్ 10శాతం ఐపీఆర్ వాటాను పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీని వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. డిజిటల్ గవర్నెన్స్, స్మార్ట్ సిటీ, ఇండస్ట్రీ 4.0, గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ వంటి రంగాలలో పెట్టుబడి 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. దీంతో పాటు మరిన్ని టెలికాం స్టార్టప్‌లను ప్రోత్సహించే ప్రణాళిక ఉంది.

యువతకు కూడా ఉపాధి..

ఈ విధానంపై ప్రభుత్వం 21 రోజుల్లో ప్రజల నుండి సూచనలు, అభిప్రాయాలను కోరింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వం సావరిన్ పేటెంట్ నిధిని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. తద్వారా భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తమ పేటెంట్లను ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ విధానం దేశాన్ని డిజిటల్ శక్తిగా మార్చడమే కాకుండా, యువతకు ఉపాధిని కూడా అందిస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి..