AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2025 Result Date: జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఎప్పుడంటే?

జనవరి 22 నుంచి 30 తేదీల మధ్య జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (జనవరి 2025) పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను ఎన్టీయే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్ధులు వీటిని తమ వివరాలు నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

JEE Main 2025 Result Date: జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఎప్పుడంటే?
JEE Main 2025 Result Date
Srilakshmi C
|

Updated on: Feb 05, 2025 | 3:09 PM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 5: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జనవరి 22 నుంచి 29 తేదీల మధ్య జరిగిన పేపర్ 1 జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (జనవరి 2025) పరీక్ష, ఇక 30వ తేదీన జరిగిన బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2 జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి దాదాపు 12 లక్షల మందికిపైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. ప్రాధమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీ రూపొందించి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారు. అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి 12న జేఈఈ మెయిన్‌ తొలి విడత ర్యాంకులు ప్రకటించనున్నారు.

ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు

ఏప్రిల్‌ 1 నుంచి 8వ తేదీల మధ్య రెండో విడత జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తులకు ఫిబ్రవరి 25 వరకు గడువు ఉంది. జేఈఈ మెయిన్‌ చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్‌ 17న తుది ర్యాంకులు ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంటుంది.

జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారన్న సంగతి తెలిసిందే. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8,500, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా జేఈఈ మెయిన్‌ రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన కేవలం నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతాయి. అందువల్లనే జేఈఈ పరీక్షకు విపరీతమైన పోటీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ