AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజినీరింగ్, MBBSలో సీటు పొందిన విద్యార్థులకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం!

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు..

ఇంజినీరింగ్, MBBSలో సీటు పొందిన విద్యార్థులకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం!
financial incentive for engineering and MBBS students
Srilakshmi C
|

Updated on: Jul 11, 2025 | 8:26 AM

Share

అమరావతి, జులై 11: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, నీట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గురుకుల విద్యార్థులకు 11 కాస్మొటిక్‌ వస్తువులను కిట్‌ రూపంలో అందించాలని అధికారులకు తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన 7 ఐఐటీ, నీట్‌ శిక్షణ కేంద్రాల్లో డిప్యుటేషన్‌పై అధ్యాపకులను నియమించాలనే నిర్ణయానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టాలని కూడా ఆయన తెలిపారు. మరోవైపు ఐఐటీ, నీట్‌లో కొద్దిలో సీటు కోల్పోయిన 120 మంది విద్యార్థులకు లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వీడియో కాన్ఫరెన్స్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వినుకొండ గురుకుల విద్యార్థిని సంకీర్తన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్ధిని కుటుంబానికి సాంత్వన పథకం కింద రూ.3 లక్షల చెక్కును మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అందించారు.

నేటితో ముగుస్తున్న ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు తుది గడువు

తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నేటితో ముగియనుందని ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. జులై 10 వరకు 74,542 మంది వెబ్‌ఆప్షన్లు పెట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు. జులై 13లోపు మాక్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని, ఆ తర్వాత విద్యార్థులు రెండు రోజులపాటు వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం ఇస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
చట్నీ చేసిన గంటకే పాడైపోతుందా?.. ఈ టిప్స్ తో చేస్తే అదిరే టేస్ట్
చట్నీ చేసిన గంటకే పాడైపోతుందా?.. ఈ టిప్స్ తో చేస్తే అదిరే టేస్ట్
తక్కువ ధరకే ఇంటర్నెట్.. గ్రామీణ ప్రజలకు శుభవార్త
తక్కువ ధరకే ఇంటర్నెట్.. గ్రామీణ ప్రజలకు శుభవార్త
అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా
అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా
రిటైర్మెంట్ తర్వాత ఈ మార్పులు చేసుకోకుంటే జీవితం నరకమే!
రిటైర్మెంట్ తర్వాత ఈ మార్పులు చేసుకోకుంటే జీవితం నరకమే!
లెదర్ వర్సెస్ ఫాబ్రిక్: ఏ సోఫా మీ ఇంటికి బెస్ట్?..
లెదర్ వర్సెస్ ఫాబ్రిక్: ఏ సోఫా మీ ఇంటికి బెస్ట్?..
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.2 లక్షలు
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.2 లక్షలు
ఈ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ.. కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా..
ఈ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ.. కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా..
తిన్న ప్లేట్లు కడిగేస్తున్నారా?.. అయితే మీరు మామూలు వ్యక్తి కాదు
తిన్న ప్లేట్లు కడిగేస్తున్నారా?.. అయితే మీరు మామూలు వ్యక్తి కాదు
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు