AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BEL Recruitment: బీటెక్‌ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేల జీతం.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ ఘజియాబాద్‌ యూనిట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా...

BEL Recruitment: బీటెక్‌ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేల జీతం.
Bel Jobs
Narender Vaitla
|

Updated on: Feb 12, 2023 | 6:00 PM

Share

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ ఘజియాబాద్‌ యూనిట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా ట్రైనీ ఇంజనీర్‌, ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్రైనీ ఇంజినీర్-1 (14), ప్రాజెక్ట్ ఇంజినీర్-1 (36) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 55% మార్కులతో బీఎస్సీ(ఇంజినీరింగ్‌)/ బీఈ, బీటెక్‌(ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-02-2023 నాటికి టీఈ పోస్టులకు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు, పీఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 40 నుంచి రూ. 55 వేల వరకు అందిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 25-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* రాత పరీక్షను మార్చి నెలలో నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..