AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Class Public Exams 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌! ఇంతకీ ఎప్పట్నుంచంటే..

Andhra Pradesh SSC Exam 2026 time table: ప్రస్తుత విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు నిర్వహించవల్సిన పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తాజా ప్రతిపాదనల మేరకు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు పరీక్ష ఫీజు చెల్లింపు..

AP 10th Class Public Exams 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌! ఇంతకీ ఎప్పట్నుంచంటే..
Andhra Pradesh Class 10 Public Examinations
Srilakshmi C
|

Updated on: Oct 26, 2025 | 3:51 PM

Share

అమరావతి, అక్టోబర్‌ 26: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తాజా ప్రతిపాదనల మేరకు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను కూడా విద్యాశాఖ విడుదల చేయనుందిది. ప్రస్తుతం పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు నవంబర్‌ 1వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది.

నవంబర్‌ 13వ తేదీలోపు విద్యార్ధులు తమ పాఠశాలల్లోని హెడ్‌మాస్టర్లకు ఫీజు చెల్లించాలని తెలిపింది. ఇక పాఠశాలల హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 14వ తేదీలోపు ఫీజు చెల్లింపులు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18లోపు డీఈవోలకు అందించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు దాదాపు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు. ఈ ఏడాది కొత్తగా హాల్‌టికెట్ల వెనుక భాగంలో పరీక్ష కేంద్రం రూట్‌ మ్యాప్‌ను కూడా విద్యాశాఖ ముద్రించనుంది. అందులోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్‌ వచ్చేస్తుంది.

మరోవైపు చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను డిసెంబరు నుంచి విద్యాశాఖ అమలు చేయనుంది. పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్‌ అధికారి, ఇన్విజిలేటర్లను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి విద్యార్థులెవరినీ డ్రాప్‌ బాక్సులో పెట్టకూడదని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో టెన్త్‌ ఫలితాల్లో వెనుకబడిన 100 పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులందరికీ తప్పనిసరిగా అపార్‌ ఐడీ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..