AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Sector: దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోలు వీరే.. జీతాలు చెల్లింపుల్లో ఈ కంపెనీలు అగ్రస్థానం

దేశంలో అత్యధికంగా చెల్లించే పరిశ్రమలలో ఐటీ రంగం ముందుంది. దేశంలోని ఐటీ కంపెనీల అధినేతలు కూడా భారీగానే జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా విప్రో, కోఫోర్జ్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలు అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లుగా నిలిచారు. ఈ ఏడాది విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే అత్యధిక వేతనంతో కూడిన సీఈవోగా నిలిచారు...

IT Sector: దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోలు వీరే.. జీతాలు చెల్లింపుల్లో ఈ కంపెనీలు అగ్రస్థానం
It Sector
Subhash Goud
|

Updated on: Aug 10, 2024 | 2:09 PM

Share

దేశంలో అత్యధికంగా చెల్లించే పరిశ్రమలలో ఐటీ రంగం ముందుంది. దేశంలోని ఐటీ కంపెనీల అధినేతలు కూడా భారీగానే జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా విప్రో, కోఫోర్జ్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలు అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లుగా నిలిచారు. ఈ ఏడాది విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే అత్యధిక వేతనంతో కూడిన సీఈవోగా నిలిచారు. ఆయన తర్వాత కోఫోర్జ్‌కు చెందిన సుధీర్ సింగ్, హెచ్‌సిఎల్ టెక్‌కి చెందిన సి విజయకుమార్ పేర్లు వచ్చాయి.

థియరీ డెల్‌పోర్ట్‌కు రూ.166 కోట్లు:

థియరీ డెల్పోర్ట్ ఏప్రిల్‌లో తన పదవికి రాజీనామా చేశారు. అతను 2023-24 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నుండి సుమారు రూ.166 కోట్లు తీసుకున్నారు. దీని తర్వాత కోఫోర్జ్‌కి చెందిన సుధీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ అతనికి రూ.105.12 కోట్లు చెల్లించింది. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. సి విజయకుమార్‌కు రూ.84.17 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. దీని తర్వాత పెర్సిస్టెంట్ సిస్టమ్స్‌కు చెందిన సందీప్ కల్రా నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.77.1 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.66 కోట్లు చెల్లించారు.

ఇవి కూడా చదవండి

టాప్‌ 10లో ఈ సీఈవోలు కూడా..

అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోల జాబితాలో ఎంఫాసిస్‌కు చెందిన నితిన్ రాకేష్ 6వ స్థానంలో ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.44.13 కోట్లు చెల్లించారు. దీని తర్వాత దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన టీసీఎస్ సీఈవో కె కృతివాసన్ హాజరయ్యారు. కంపెనీ అతనికి రూ.25.2 కోట్లు చెల్లించింది. కృతివాసన్ జూన్ 2023లో కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఇది కాకుండా దేబాషిస్ ఛటర్జీ ఎల్‌టిఐ మైండ్‌ట్రీకి సిఇఒగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరానికిగానూ కంపెనీ అతనికి రూ.19.34 కోట్లు చెల్లించింది.

ఐటీ రంగంలో 7 నుంచి 9 శాతం వృద్ధి:

ఈ ఏడాది తన ఉద్యోగులకు 8 నుంచి 11 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఇండియా ఇంక్ సిద్ధమవుతోందని ఏప్రిల్‌లో రాండ్‌స్టాడ్ నివేదిక పేర్కొంది. కానీ ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ రంగంలో 7 నుంచి 9 శాతం మాత్రమే పెరుగుదల ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ సగటున 9 శాతం, విప్రో 9.2 శాతం పెరిగాయి. టీసీఎస్‌ కూడా 7 నుండి 9 శాతం మధ్య జీతాల పెంపును ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us