AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market Scam: స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా.. అజాగ్రత్తగా ఉంటే అంతే..

ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. నకలీ వెబ్ సైట్లతో లాభాల ఆశ చూపి నట్టేట ముంచుతున్నారు. దేశంలో ఆన్‌లైన్ స్టాక్ పెట్టుబడి మోసాలు పెరిగాయి. కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా వందల మంది ఈ స్కామ్‌ల బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నారు.

Stock Market Scam: స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా.. అజాగ్రత్తగా ఉంటే అంతే..
Cyber Crime
Madhu
|

Updated on: May 19, 2024 | 8:54 AM

Share

ఆన్ లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అదే స్థాయిలో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. నకలీ వెబ్ సైట్లతో లాభాల ఆశ చూపి నట్టేట ముంచుతున్నారు. దేశంలో ఆన్‌లైన్ స్టాక్ పెట్టుబడి మోసాలు పెరిగాయి. కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా వందల మంది ఈ స్కామ్‌ల బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నారు.

రూ.23 లక్షల మోసం..

ఢిల్లీకి చెందిన మొహమ్మద్ దౌద్ అనే 29 ఏళ్ల యువకుడు ఒక నకిలీ వెబ్ సైట్ ను రూపొందించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు అందజేస్తామని దానిలో వివరించాడు. అది నిజమని నమ్మిన 32 ఏళ్ల మహిళ ఆన్ లైన్ లో మొహమ్మద్ దౌద్ ను సంప్రదించింది. అతడు మొదట రూ. 1,000 పెట్టుబడి పెట్టాలని ఆమెను ఒప్పించాడు. ఆ మహిళ అలా చేయగానే రూ. 1,300 రాబడి వచ్చింది. దీంతో ఆమె నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టింది. సుమారు 23.5 లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆమె ఫోన్ కు దౌడ్ స్పందించడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడి అరెస్టు..

పోలీసులు రంగంలోకి దిగి దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని మౌజ్ పూర్ ప్రాంతంలో దౌద్ ను అరెస్టు చేశారు. అతడి నుంచి 17 సిమ్‌కార్డులు, 11 డెబిట్ కార్డులు, నాలుగు పాస్‌ పుస్తకాలు, 15 చెక్ బుక్‌లు, రెండు స్టాంపులు, ఒక ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దౌద్ బ్యాంకు ఖాతా నుంచి రూ.8.55 లక్షలు రికవరీ చేశారు. మిగిలిన డబ్బు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్టు గుర్తించారు. దౌద్ తన సహచరుడి సాయంతో ఇలా మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతడిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.

  • మరో వ్యాపారవేత్త సైబర్ క్రైమ్‌లో చిక్కుకుని రూ. 5.2 కోట్లు కోల్పోయాడు. ఓ యాప్ ను డౌన్‌లోడ్ చేసి, అధిక రాబడి కోసం దానిలో పెట్టుబడి పెట్టి మోసపోయాడు.
  • పూణేకు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ మోసంలో రూ.24.12 లక్షలు పోగొట్టుకుంది. దానిలో పెట్టుబడి పెట్టడానికి తన ఆభరణాలను విక్రయించింది. చివరకు మోసపోయింది.

ఎన్ఎస్ఈ హెచ్చరిక..

స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) పెట్టుబడిదారులను హెచ్చరించింది. స్టాక్ మార్కెట్‌లో గ్యారెంటీ రిటర్న్‌లను అందించే ఏవైనా పథకాలు, ఉత్పత్తులకు సభ్యత్వం తీసుకోవద్దని సూచించింది. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ఆధారాలైన యూజర్ ఐడీ/పాస్‌వర్డ్ లేదా ఇతర సమాచారాన్ని ఎవరికి చెప్పకూడదని సూచించింది. సెబీ వెబ్‌సైట్‌లో ఎంటీటీల రిజిస్టర్డ్ స్టేటస్‌ను వెరిఫై చేయాలని ఇన్వెస్టర్లను కోరింది.

ఈ జాగ్రత్తలు పాటించాలి..

  • తక్కువ రిస్క్ తో అధిక రాబడికి హామీ ఇచ్చే వాటిలో పెట్టుబడులు పెట్టకూడదు. చట్టబద్ధమైన పెట్టుబడులు స్వాభావిక నష్టాలను కలిగి ఉంటాయి. అధిక రాబడి సాధారణంగా అధిక రిస్క్‌తోనే వస్తుంది.
  • ఆన్‌లైన్‌లోని పెట్టుబడి పథకాలపై జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాటిలో డబ్బులు పెట్టకూడదు.
  • ఫిషింగ్ ఇమెయిల్‌, సందేశాలు నిజమైన సంస్థలను అనుకరిస్తాయి. మీ లాగిన్ వివరాలను దొంగిలించే లింక్‌లు కూడా ఉంటాయి. మీ బ్యాంకు లేదా బ్రోకర్ నుంచి వచ్చినట్టు కనిపించే ఇమెయిల్ లపై జాగ్రత్తగా ఉండండి.
  • పేరున్న బ్రోకర్ల ద్వారా పెట్టుబడి పెట్టండి, మీ డీమ్యాట్ ఖాతాను తెరిచి, మంచి పేరున్న సెబీ-రిజిస్టర్డ్ బ్రోకర్ల ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..