AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy Instamart: 2024లో స్విగ్గీలో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులు.. వీటికి ఇంత డిమాండా..?

Swiggy Instamart: అత్యధికంగా అమ్ముడవుతోంది | చాలా మంది వ్యక్తులు స్విగ్గి ద్వారా స్విగ్గీ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. కాగా, స్విగ్గీ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన సమాచారం ఉంది. ఈ ఏడాదిలో అత్యధికంగా అమ్మడైన వస్తువుల గురించి వెల్లడించింది స్విగ్గి. వార్షిక నివేదికలో ఆశ్చర్యపోయే వస్తువులు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Swiggy Instamart: 2024లో స్విగ్గీలో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులు.. వీటికి ఇంత డిమాండా..?
Subhash Goud
|

Updated on: Dec 29, 2024 | 9:38 PM

Share

సాంకేతిక అభివృద్ధి కారణంగా ప్రపంచం చాలా వేగంగా పని చేస్తోంది. గతంలో చాలా గంటలు పట్టే పని ఇప్పుడు సాంకేతికత, ఇంటర్నెట్ సేవల సహాయంతో చాలా సులభంగా చేయవచ్చు. ఇంతకు ముందు ఏదైనా వస్తువులు కొనాలంటే షాపులకు వెళ్లి గంటల కొద్దీ వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఈ రోజుల్లో మీరు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మీ ఇంటి సౌకర్యం నుండి ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు దీని కోసం పనిచేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఆ మాత్రం ఆగలేవా ఏంటి..! మరి కాసేపట్లో పెళ్లి అనగా వరుడు ఏం చేశాడంటే..!

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తన వార్షిక నివేదికను విడుదల:

2024కి కొద్ది రోజుల దూరంలో హోమ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఏ ఉత్పత్తులు ఎక్కువగా విక్రయించబడ్డాయి, ఏ స్థలం నుండి ఎక్కువ ఉత్పత్తులు ఆర్డర్ అయ్యాయి? అవి ఏంటో తెలుసుకుందాం..

Swiggyలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువులు:

  • Swiggy నుండి వచ్చిన ఈ నివేదికలో.. అహ్మదాబాద్‌కు చెందిన వ్యక్తి Swiggy Instamart ఉపయోగించి రూ. 8 లక్షల విలువైన బంగారు నాణేలను కొనుగోలు చేశాడు.
  • దీపావళి పండుగ సందర్భంగా భారతదేశంలో ఒక్కరోజులో రూ. 45 లక్షలకు చీపురు కొనుగోలు చేశారు.
  • బెంగళూరులో శృంగార ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకంగా ప్రతి 140 ఆర్డర్‌లకు ఒక కండోమ్‌ను ఆర్డర్ చేశారట.
  • అదే విధంగా అర్థరాత్రి స్నాక్స్ ఎక్కువగా ఆర్డర్ అయ్యాయి. రాత్రి 10, 11 గంటల సమయంలో చిప్స్, గుర్కురే వంటివి ఆర్డర్ చేయడం సాధారణ ప్రజలకు అలవాటుగా ఉంది.
  • ప్రధానంగా ఢిల్లీలోని డెహ్రాడూన్ ప్రాంతంలో గోధుమ పిండి, నెయ్యి వంటి వంట వస్తువులు దాదాపు రూ.20 లక్షల వరకు విక్రయాలు జరిగాయి.
  • ఇంటికే సరుకులు డెలివరీ చేయడం ప్రత్యేకతగా భావించినా.. ఒక్క స్విగ్గీ నుంచే కోట్ల రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు: ఉత్తర్వులు జారీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి