AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI RD Rates: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఆర్‌డీ వడ్డీ రేట్లను పెంచిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..!

SBI RD Rates: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్ (RD)పై వడ్డీ రేట్లను పెంచింది. ఇది జూన్ 14, 2022 నుండి అమల్లోకి వచ్చింది..

SBI RD Rates: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఆర్‌డీ వడ్డీ రేట్లను పెంచిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..!
Subhash Goud
|

Updated on: Jun 16, 2022 | 2:22 PM

Share

SBI RD Rates: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్ (RD)పై వడ్డీ రేట్లను పెంచింది. ఇది జూన్ 14, 2022 నుండి అమల్లోకి వచ్చింది. RD ఖాతాల కాలవ్యవధి 12 నెలల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో మీరు కనీసం 100 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RD లో సాధారణ వినియోగదారునికి 5.30 నుండి 5.50 శాతం వరకు వడ్డీ ఇవ్వబడుతుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అంటే 0.50 శాతం అదనపు వడ్డీ ఇవ్వబడుతుంది.

5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు RD లో 5.50 శాతం లభిస్తుంది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ, రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉన్న RD లకు ఇప్పుడు 5.30 శాతం వడ్డీ లభిస్తుంది. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ, మూడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న RD లకు 5.35 వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ RDలపై ఇచ్చే వడ్డీని 15 బేసిస్ పాయింట్లు అంటే 0.15 శాతం పెంచింది. ఇంతకుముందు ఈ కాలానికి ఆర్‌డిపై 5.20 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. ఇప్పుడు అది 5.35 శాతానికి పెరిగింది. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ, ఐదేళ్లలోపు RDలు 5.45 శాతం ఉంది. అయితే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు, స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు 5.50 శాతం లాభం లభిస్తుంది.

కొత్త రేట్లు ఇలా..

ఇవి కూడా చదవండి

1 సంవత్సరం పైన, 2 సంవత్సరాల కంటే తక్కువ 5.30 శాతం

2 సంవత్సరాల పైన, 3 సంవత్సరాల లోపు 5.35 శాతం

3 సంవత్సరాలపైన, 5 సంవత్సరాలలోపు 5.45 శాతం

5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు 5.50 శాతం

SBI టర్మ్ డిపాజిట్లు, దేశీయ బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది రూ. 2 కోట్ల కంటే తక్కువ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 20 బేసిస్ పాయింట్లు లేదా 0.20 శాతం పెంచుతున్నట్లు ఎస్‌బీఐ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు, స్టేట్ బ్యాంక్ కూడా 75 బేసిస్ పాయింట్లు అంటే 0.75 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూన్ 8న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రెపో రేటు 4.40 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచిన తర్వాత, అన్ని బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. దీనితో పాటు, సేవింగ్స్ ఖాతాలు, ఎఫ్‌డిలు, ఆర్‌డిల వంటి పథకాలపై కూడా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి