AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: నిలకడగానే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver rate Today: దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలు నానాటికీ పెరుగుతూనే వచ్చాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు

Silver Price Today: నిలకడగానే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price
Shaik Madar Saheb
|

Updated on: Jun 22, 2021 | 5:31 AM

Share

Silver rate Today: దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలు నానాటికీ పెరుగుతూనే వచ్చాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అదేవిధంగా దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా గతవారం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు.. మంగళవారం కూడా తటస్థంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 67,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

• హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,100 లు ఉంది. • విజయవాడలో వెండి రూ.73,100లు వద్ద కొనసాగుతోంది. • దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,600 గా ఉంది. • ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 67,600 గా ఉంది. • కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.67,600 వద్ద కొనసాగుతోంది. • కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,600 వద్ద ఉంది. • తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100 ఉంది. కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లోనే వెండి ధరలు ఎక్కువ రేటుతో కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. • హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,900 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,890 వద్ద కొనసాగుతోంది. • విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,890 వద్ద కొనసాగుతోంది. • విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,890 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో..

దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..