AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయా..? ఎందుకీ సడన్ షాక్..?

ఉన్నట్టుండి చమురు ధరలు (పెట్రోల్, డీజిల్) ఎందుకు పెరుగుతోన్నాయి..? వీటి పెరుగుదలతో.. వినియోగదారుల గుండెల్లో ఒక్కసారిగా బాంబ్ పేల్చుతున్నాయి. రెండు రోజుల నుంచి.. పైసల రూపంలో.. పెరుగుతున్న పెట్రోలు ధరలు.. మరో రెండు రోజుల్లో 7 రూపాయలు పెరుగుతుందనే వార్త.. పెట్రోల్ వినియోగదారులను హడలెత్తిస్తోంది. ఇప్పటికే.. పెరిగిన ట్రాఫిక్ చలానాలతో.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న.. జనాలు.. ఇప్పుడీ చేధు వార్తతో మరింత గాబరా పడుతున్నారు. ఇప్పుడీ.. పెరగనున్న పెట్రోల్ రేట్లతో.. వినియోగదారుల మొఖాలు.. వెలవెల బోతాయా..? వాహనాలు […]

పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయా..? ఎందుకీ సడన్ షాక్..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2019 | 7:55 AM

Share

ఉన్నట్టుండి చమురు ధరలు (పెట్రోల్, డీజిల్) ఎందుకు పెరుగుతోన్నాయి..? వీటి పెరుగుదలతో.. వినియోగదారుల గుండెల్లో ఒక్కసారిగా బాంబ్ పేల్చుతున్నాయి. రెండు రోజుల నుంచి.. పైసల రూపంలో.. పెరుగుతున్న పెట్రోలు ధరలు.. మరో రెండు రోజుల్లో 7 రూపాయలు పెరుగుతుందనే వార్త.. పెట్రోల్ వినియోగదారులను హడలెత్తిస్తోంది. ఇప్పటికే.. పెరిగిన ట్రాఫిక్ చలానాలతో.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న.. జనాలు.. ఇప్పుడీ చేధు వార్తతో మరింత గాబరా పడుతున్నారు.

ఇప్పుడీ.. పెరగనున్న పెట్రోల్ రేట్లతో.. వినియోగదారుల మొఖాలు.. వెలవెల బోతాయా..? వాహనాలు కొంటే.. ఒక చిక్కు.. కొనకపోతే.. ఒక చిక్కు అన్నచందంగా.. మారింది. రెండు, మూడు సంవత్సరాల క్రితం లీటర్‌ పెట్రోలు రూ.50లు అంటేనే.. నోరెళ్ల పెట్టేవాళ్లం. కానీ.. కొన్ని నెలల క్రితం ఒక రేంజ్‌లో 80 రూపాయల గీటు దాటాయి పెట్రోల్, డీజిల్ ధరలు.

ప్రస్తుతం మార్కెట్లో.. లీటర్ పెట్రోల్ ధర మరో 15 పైసలు పెరిగి రూ.76.69గా ఉంది. మూడు నెలల క్రితం.. అంటే.. ఇదే రోజు 2018 జులై 17వ తేదీ 74.29గా ఉంది. అలాగే.. లీటర్ డీజిల్ ధర 16 పైసలు పెరిగి రూ.71.46గా ఉంది. మూడు నెలల క్రితం లీటర్ డీజిల్ ధర రూ.69.55గా ఉంది. ఈ రకంగా.. హెచ్చుతగ్గులకు లోనవుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ రూ.7లు పెరిగితే.. లీటర్ పెట్రోల్ ధర రూ.84లు అవుతుంది. ఇక డీజిల్ రూ.78లు అవుతుంది.

Shock to customers: Hike in petrol price

అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా.. పెట్రోలు ధరలు పెరిగే అవకాశం మెండుగా కనిపిస్తోంది. దుబాయ్‌లో.. పెట్రోల్ బావులుంటాయని సాధారణంగా.. మనందరికీ తెలిసిందే. గతవారం సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీలో జరిగిన డ్రోన్ దాడి కారణంగానే చమురు ధరలు పెరనున్నాయి. ప్రపంచంలోనే పెట్రో ఉత్పత్తులు ప్రాసెసింగ్ చేసే అతిపెద్ద కంపెనీ.. అరామ్కో ఆయిల్. హుతీ రెబెల్స్ చేసిన డ్రోన్ దాడిలో.. సౌదీలోని అబక్ అండ్ ఖురాయిస్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బతిన్నాయి. దీంతో.. కంపెనీ తమ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించింది. దెబ్బతిన్న క్రూడ్ ఆయిల్ బావులను బాగు చేశాకే ఉత్పత్తిని పెంచుతామని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో వచ్చే 15 రోజుల్లో లీటర్‌పై రూ.7 నుంచి 10 వరకు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత 28 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం 20 శాతం పెరిగాయి. అందుకే.. మన దేశంతో పాటు.. పలు దేశాల్లో పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 1991 జనవరి 14 తర్వాత ఒక రోజులో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి.

కాగా.. ప్రస్తుతం క్రూడ్‌ ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నాయని, అయితే.. తర్వరలో మాత్రం ఖచ్చితంగా వాటి ధరలు పెరిగే అవకాశం మాత్రం ఉందని ‘హిందూస్థాన్ పెట్రోలియం సంస్థ’ తెలిపింది. ఈ లెక్కల్లో చూసుకుంటే.. క్రూడ్ ఆయిల్ ధరలు 10 శాతం పెరిగితే కనుగ.. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భగ్గుమనడం ఖాయమని పెట్రో వర్గాలు భావిస్తున్నారు.

Shock to customers: Hike in petrol price