AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Loans: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెంపు

భారతదేశంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దేశంలో అతి పెద్ద బ్యాంకుగా ఎస్‌బీఐ నిలిచింది. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో పాటు ఎక్కువ బ్రాంచ్‌లతో వినియోగదారులకు సేవలను అందిస్తూ ఉంటుంది. అయితే ఎస్‌బీఐ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎంసీఎల్ఆర్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్‌బీఐ లోన్ రేట్లు పెరగనున్నాయి.

SBI Loans: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెంపు
SBI
Nikhil
|

Updated on: Nov 16, 2024 | 6:09 PM

Share

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫండ్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)కు సంబంధించిన మార్జినల్ కాస్ట్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేటు తగ్గడం ప్రారంభించినప్పటికీ ఆర్‌బీఐ కూడా 2025లో కీలకమైన రెపో రేటును తగ్గించడం ప్రారంభిస్తుందనే అంచనా నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ఎంసీఎల్ఆర్ పెంపు వల్ల రుణాలపై వడ్డీ రేట్లను పెరుగుతాయి. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోని నోటీసు ప్రకారం హోమ్ ఫైనాన్స్ వంటి దీర్ఘకాలిక రుణాలు అనుసంధానించిన కీలకమైన ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ నుంచి 0.05 శాతం నుంచి 9 శాతానికి పెంచారు. ఎస్‌బీఐ ఇటీవల కాలంలో ఎంసీఎల్ఆర్‌ను రెండుసార్లు పెంచారు. 

ఎస్‌బీఐ రుణ పుస్తకంలో 42 శాతం ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానించారని, మిగిలినవి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారితంగా ఉంటాయి. సిస్టమ్‌లో డిపాజిట్ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని బ్యాంక్ కస్టమర్‌కు పుల్ ఫ్యాక్టర్‌గా రేటును ఉపయోగించదు. ఎస్‌బీఐ  మూడు, ఆరు నెలల కాలవ్యవధిలో ఎంసీఎల్ఆర్‌ను కూడా పెంచింది. బ్యాంకు ఓవర్‌నైట్, ఒక నెల, రెండు సంవత్సరాల మరియు మూడు సంవత్సరాల కాలవ్యవధిలో కొనసాగించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఖచ్చితంగా వడ్డీ రేట్లను తగ్గించాలని ఇటీవల వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లలో భారత్‌లో సగటు ద్రవ్యోల్బణం స్వాతంత్య్రానంతరం కనిష్ట స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు.

అక్టోబర్ 2024 రిటైల్ ద్రవ్యోల్బణం సంఖ్యను ప్రస్తావిస్తూ ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ చివరిసారి వారి సిఫార్సులతో వచ్చినప్పుడు, వారు కూడా ఈ నెలలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేశారని, అందువల్ల బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాలని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో భారత సీపీఐ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.1 శాతానికి ఎగబాకింది. ఆగస్టు తర్వాత ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 శాతం పరిమితిని అధిగమించడం ఇదే తొలిసారి. అలాగే ఆహార ద్రవ్యోల్బణం 10.87 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us